అనుష్కకి తప్పని ట్రోలింగ్…

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటి అనుష్క శెట్టి.. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్వీటీ అరుంధతి సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమాతో అనుష్క క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వరసగా వచ్చాయి. అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఎన్నో సూపర్, డూపర్ హిట్స్ కొట్టేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలిలో దేవసేన పాత్రను అనుష్క పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. […]

Share:

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటి అనుష్క శెట్టి.. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్వీటీ అరుంధతి సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమాతో అనుష్క క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వరసగా వచ్చాయి. అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఎన్నో సూపర్, డూపర్ హిట్స్ కొట్టేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలిలో దేవసేన పాత్రను అనుష్క పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో కూడా స్వీటీ సైలెంట్ గా ఉంటోంది. బాహుబ‌లి హిట్ త‌ర్వాత మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని అనుష్క చాలా రోజులుగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటూ వ‌స్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యమిచ్చే అనుష్క, ఇతర హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలను ఎక్కువగా పక్కన పెట్టేసింది. ఈ బ్యూటీ కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. అయితే సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క, మళ్లీ స్లిమ్ అవ్వడానికి చాలా టైమ్ పట్టింది. అయినా మునపటి స్థితికి రాలేదనే చెప్పుకోవాలి.

అయితే ఇప్పుడు యంగ్ హీరోల సరసన సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్న అనుష్క.. జాతి రత్నాల ఫేమ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నవీన్ పొలిశెట్టి నటిస్తున్న చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తుండగా, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాలో అనుష్క పాత్ర ఎలా ఉంటుందో, సినిమాలో ఎలా కనిపించబోతుందో అనే ఆసక్తి స్వీటీ అభిమానుల్లో పెరిగిపోయింది. అయితే తాజాగా అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమాలో ఆమె పేరు ‘అన్వితా రవళి శెట్టి’గా ఉండబోతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

అయితే ఇన్నాళ్లుగా ఎక్కడా కనిపించని అనుష్క..  తాజాగా బెంగళూరులో జరిగిన శివరాత్రి వేడుకలకు కుటుంబంతో కలిసి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె సల్వార్ కమీజ్‌లో చాలా అందంగా ఉంది. కానీ పోస్టర్లో అనుష్కకి, బయటి అనుష్కకి చాలా తేడా ఉన్నట్టు అనిపించింది. దీనివల్ల ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుండి, చాలా మంది ఆమె రూపాన్ని దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అనుష్క శెట్టి తన బరువు గురించి ట్రోల్స్ ఎదుర్కోవడం ఇదేం మొదటిసారి కాదు. ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క బరువు పెరిగింది. అయితే ఆ తర్వాత ఆమె బరువు తగ్గలేకపోయిందని, కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని కొందరు అంటున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏమైనప్పటికీ, ఆమె బరువు గురించి సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం ఆమె అభిమానులలో కొంతమందికి చాలా బాధగా ఉంది. బరువు పెరిగిన తర్వాత కూడా ఆమె ‘భాగమతి’, బాహుబలి 2 చిత్రాలతో హిట్‌లు కొట్టింది. ప్రస్తుతం ఆమె UV క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొంటోంది.