‘ఆర్ ఎక్స్100’తో సంచలనం..  ‘మంగళవారం’తో మళ్లీ ప్రయోగం

ఇండస్ట్రీలో హిట్ ఇచ్చిన హీరో గురించి ఎక్కువగా వినిపిస్తుంది.. హిట్ సినిమా తీసిన డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు.. ఇండస్ట్రీలో హిట్ అనేదే ప్రామాణికం. హిట్టు ఉన్నప్పుడే అందరూ చుట్టుపక్కలా ఉంటారు.. పొరబాటున ఫ్లాప్ పడితే సంగతి అంతే ఇక. మళ్లీ హిట్టు కొట్టే వరకు ఇండస్ట్రీ జనాలు పట్టించుకోరు. అయితే టాలెంట్ ఉండి, కంటెంట్ ఉన్న వాళ్లు ఎప్పటికైనా సరే హిట్ కొట్టేస్తారు. కాస్త ఆలస్యం అవుతుందేమో గానీ హిట్ మాత్రం కొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆర్ […]

Share:

ఇండస్ట్రీలో హిట్ ఇచ్చిన హీరో గురించి ఎక్కువగా వినిపిస్తుంది.. హిట్ సినిమా తీసిన డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు.. ఇండస్ట్రీలో హిట్ అనేదే ప్రామాణికం. హిట్టు ఉన్నప్పుడే అందరూ చుట్టుపక్కలా ఉంటారు.. పొరబాటున ఫ్లాప్ పడితే సంగతి అంతే ఇక. మళ్లీ హిట్టు కొట్టే వరకు ఇండస్ట్రీ జనాలు పట్టించుకోరు. అయితే టాలెంట్ ఉండి, కంటెంట్ ఉన్న వాళ్లు ఎప్పటికైనా సరే హిట్ కొట్టేస్తారు. కాస్త ఆలస్యం అవుతుందేమో గానీ హిట్ మాత్రం కొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.

ఆర్ ఎక్స్100 మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో సంచలనం రేపిన డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. ఆ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఇంట్రెస్టింగ్‌ స్టోరీ, ఎన్నో బోల్డ్‌ సీన్స్‌, మంచి పాటలతో ఆ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అలాంటి డైరెక్టర్‌ నుంచి వచ్చిన రెండో సినిమా మహా సముద్రం నిరాశ పరిచింది. ఈ సినిమాను సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ, శర్వానంద్‌లాంటి పెద్ద స్టార్స్‌తో తీసినా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడు అజయ్‌ భూపతి తన మూడో సినిమా మంగళ వారంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100 జానర్‌లోనే ఈ సినిమా కూడా రూపొందనున్నట్లు తెలుస్తోంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో కాస్త హర్రర్ ను జోడించి ఈ సినిమాను అజయ్‌ భూపతి తెరకెక్కించనున్నాడు. అంతేకాదు ఈ మూవీని అజయ్ సొంతంగా నిర్మించనున్నట్లు కూడా సమాచారం. తన సన్నిహితులతో కలిసి అతడీ సినిమా చేయనున్నాడు

ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్  ఓ ప్రధాన పాత్రధారి. ఆల్రెడీ రిలీజైన ‘గణగణ మోగాలిరా’ అంటూ సాగే ఈ అమ్మవారి జాతర సాంగ్ పూనకాలు తెప్పించేలా ఉంది. ప్రచార చిత్రాలు సినిమాపై ప్రేక్షకుల చూపు పడేలా చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే… సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. మంగళవారం చిత్రాన్ని నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్నారు. 

విడుదల తేదీ వెల్లడించిన సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ”గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సినిమాలో ఉన్న ప్రతి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎవరు మంచి? ఎవరు చెడు? అనేది కనిపెట్టలేని విధంగా కథ, కథనాలు ముందుకు వెళతాయి. పాయల్ క్యారెక్టర్ చూస్తే ప్రేక్షకులు షాక్ అవుతారు. థియేటర్లలో డిఫరెంట్ థ్రిల్ ఇచ్చే చిత్రమిది” అని చెప్పారు.

‘ఆర్ఎక్స్ 100’తో తెలుగులో ఏ విధంగా అయితే కొత్త ట్రెండ్ సెట్ చేశారో… ఇప్పుడు ‘మంగళవారం’తో కూడా అజయ్ భూపతి సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారని నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ ”ఇదొక డిఫరెంట్ అటెంప్ట్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ప్రయత్నించని విధంగా అజయ్ భూపతి సినిమా తీశారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం… ‘విక్రమ్ వేద’, ‘కాంతార’, ‘విక్రాంత్ రోణ’ చిత్రాలకు పని చేసిన, రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న ఎంఆర్ రాజా కృష్ణన్ సౌండ్ డిజైన్ హైలైట్ అవుతాయి” అని చెప్పారు. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నామని తెలిపారు.

Tags :